న్యూఢిల్లీ : సెప్టెంబర్ నుంచి తమ వాహనాల ధరలు పెరగనున్నాయని మారుతి సుజుకి వెల్లడించింది. ముడిపదార్ధాల ధరలు ఎగబాకడంతో కార్ల ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాదిగా వాహనాల తయారీలో ఉపయోగించే పలు ముడిపదార్ధాల ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయని, వీటిలో కొంతమేర కస్టమర్ల మీద భారం మోపకతప్పలేదని పేర్కొంది.
వచ్చే నెల నుండి వాహనాల ధరలను ఎంతమేర పెంచుతామనే వివరాలను మారుతి సుజుకి వెల్లడించలేదు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి మారుతి సుజుకి తమ వాహనాల ధరలను పెంచడం ఇది నాలుగవసారి కావడం గమనార్హం. గతంలో పెరిగిన మోడళ్ల ధరనూ తిరిగి సవరిస్తారా అనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది.