work from Home | వర్క్ ఫ్రం హోం థీమ్ దీర్ఘ కాలం కొనసాగితే తమ కాపురాలు కూలిపోతాయని వివిధ సంస్థల ఉద్యోగుల జీవిత భాగస్వాములు ప్రత్యేకించి భార్యలు ఆందోళన చెందుతున్నారు. దీనికి నిదర్శనమే ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంకాను ఉద్దేశించి చేసిన ట్వీట్.. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలన్నీ సకాలంలో తమ వ్యాపార లావాదేవీలు సాగడానికి, కస్టమర్లకు సర్వీసులందించడానికి వర్క్ ఫ్రం హోం థీమ్ అమలు చేస్తున్నాయి. నియో నార్మల్ కండీషన్స్కు ప్రతి ఒక్కరూ అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా ట్విట్టర్లో షేర్ చేసిన ఓ లెటర్.. నెటిజన్లకు గిలిగింతలు పెడుతోంది..
ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్లో పని చేస్తున్న ఓ ఉద్యోగి భార్య.. సంస్థ చైర్మన్కు నిరాశా నిస్పృహలతో చేసిన ట్వీట్లో.. ఇంకొంత కాలం వర్క్ ఫ్రం హోం కొనసాగితే .. మా వైవాహిక జీవితానికి తెర పడుతుంది.. ఈ థీమ్కు స్వస్తి పలకడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ మానసిక ఆరోగ్యం దెబ్బ తినకుండా దీనిపై ఆమెకు ఎలా సమాధానమివ్వాలో అర్థం కావట్లేదంటూ హర్ష గోయెంకా ట్వీట్ చేశారు.
ఆమె తన భర్త రోజుకు 10 సార్లు కాఫీ తాగుతారని, వేరే గదిలో పని చేస్తున్నా.. నిరంతరం ఫుడ్ కోసం గోల చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. పని చేస్తూనే నిద్ర పోతారని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని ఫిర్యాదుల వర్షం కురిపించారు. తన ఇద్దరు పిల్లల బాగోగులు కూడా చూసుకోవాల్సి ఉందని కూడా పేర్కొన్నారు. హర్ష గోయంకా చేసిన ఈ ట్వీట్పై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.