ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో తొలిసారి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 60 వేల పాయింట్ల మార్క్ను దాటింది. గతవారం ట్రేడింగ్లో టాప్-10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,56,317.17 కోట్లు పెరిగింది. గత వారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1.74 శాతం లేదా 1032.58 పాయింట్లు పెరిగింది. శుక్రవారం ట్రేడింగ్లో 60 వేల పాయింట్ల మార్క్ను అధిగమించింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.58,671.55 కోట్లు పెరిగి రూ.15,74,053.03 కోట్లకు చేరుకున్నది. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్లో రిలయన్స్ స్క్రిప్ట్ ర్యాలీ కావడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16 లక్షల కోట్లు దాటింది.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,605.08 కోట్లు పెరిగి రూ.7,48,032.17 కోట్లకు చేరుకున్నది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.22,173.04 కోట్లు ఎక్కువై దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,70,465.58 కోట్ల వద్ద ముగిసింది. మరో ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.15,110.63 కోట్లు పెరిగి రూ.14,32,013.76 కోట్ల వద్ద స్థిర పడింది.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.10,142 కోట్లు పెరిగి రూ.8,86,739.86 కోట్లకు చేరుకున్నది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటైజేషన్ రూ.6,068.69 కోట్లు ఎక్కువై రూ.4,05,970.66 కోట్ల వద్ద స్థిర పడింది. ఎఫ్ఎంసీజీ మేజర్ హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ. Rs 6,44,199.18 కోట్ల వద్ద ముగిసింది.
ప్రైవేట్ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎం-క్యాప్ రూ.4,254.75 కోట్లు పెరిగి రూ.4,01,978.75 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. రూ. 2,523.56 కోట్లు పెరిగి రూ.5,13,073.85 కోట్ల వద్ద స్థిరపడింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.1,904.22 కోట్లు ఎక్కువై రూ.5,01,080.90 కోట్లతో ముగిసింది.