న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. త్వరలో విడుదల చేయనున్న ఎక్స్యూవీ700కి కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం 57 నిమిషాల్లోనే 25 వేల బుకింగ్లు వచ్చాయని కంపెనీ పేర్కొంది. తొలి 25 వేల యూనిట్లకు రూ.11.99 లక్షల నుంచి రూ.22.89 లక్షల మధ్యలో ధర ఉంటుందని సంస్థ గతంలో ప్రకటించడంతో కొనుగోలుదారులు ఎగబడి బుకింగ్లు చేసినట్లు తెలుస్తున్నది. తొలి రౌండ్కు వచ్చిన విశేష స్పందనతో ఈ శుక్రవారం ఉదయం 10 గంటలకు రెండో రౌండ్ ఆరంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది . రెండో రౌండ్లో మాత్రం ఈ వాహన ధరను రూ.12.49 లక్షల నుంచి రూ.22.99 లక్షల మధ్యలో నిర్ణ యించింది.