న్యూఢిల్లీ : వరుస టీజర్లతో ఆసక్తి రేపిన మహీంద్రా ఎక్స్యూవీ700 ఎస్యూవీ గ్లోబల్ లాంఛ్ తేదీని మహీంద్రా ఎట్టకేలకు అధికారికంగా వెల్లడించింది. భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్ట్ 14న ఎక్స్యూవీ700 లాంఛ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఎక్స్యూవీ 500ను రీప్లేస్ చేస్తూ అత్యాధునిక ఫీచర్లతో ఎక్స్యూవీ700 ముందుకు రానుంది. కంపెనీ బ్రాండ్ న్యూ లోగోతో లాంఛ్ అవుతున్న తొలి మోడల్ ఇదే.
మహీంద్రా ఎక్స్యూవీ700 హ్యుండై అల్కాజర్, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి సిక్స్, సెవెన్ సీటర్ ఎస్యూవీలకు గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇక ఎక్స్యూవీ700 ధర రూ 14లక్షల నుంచి రూ 18 లక్షల (ఎక్స్షోరూం) వరకూ ఉంటుందని అంచనా. ఎక్స్యూవీ500 స్ఫూర్తితో సెవెన్ సీటర్ మహీంద్రా ఎక్స్యూవీ700లోనూ యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్ యూనిట్, వెర్టికల్ క్రోం హైలైట్స్తో స్క్వారిష్ గ్రిల్ వంటి ఫీచర్లు కొనసాగుతాయి.