న్యూఢిల్లీ : ఎస్యూవీ సెగ్మెంట్లో పేరొందిన మహీంద్రా న్యూ ఎక్స్యూవీ 500 భారత మార్కెట్లో జులైలో లాంఛ్ కానుంది. 2021 మహీంద్రా ఎక్స్యూవీ 500 రెండు లేదా మూడో త్రైమాసంలో లాంఛ్ అవుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో డివిజన్ సీఈఓ విజయ్ నక్రా వెల్లడించారు. ప్రస్తుత మోడల్తో పోలిస్తే ఏడు సీట్లు కలిగిన న్యూ ఎస్యూవీలో కీలక మార్పులు ఉంటాయని భావిస్తున్నారు.
అడ్వాన్స్డ్ లుక్తో పాటు రివైజ్డ్ గ్రిల్, న్యూ డోర్ హ్యాండిల్స్ వంటివి అదనపు ఆకర్షణలుగా నిలువనున్నాయి. న్యూ ఎక్స్యూవీ 500 క్యాబిన్ గతంలో కంటే విశాలంగా ఉండనుంది. బిగ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్, మూడో వరుసలో అడ్జస్టబుల్ హెడ్రెస్ట్, కప్ హోల్డర్స్ వంటి అప్గ్రేడెడ్ ఫీచర్లను జోడించనున్నారు.