మహీంద్రా గ్రూప్ ట్రక్-బస్ విభాగం.. ఆల్-న్యూ ఫ్యూరియో 7 శ్రేణిలో తేలికపాటి వాణిజ్య ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. 4-టైర్ కార్గో, 6-టైర్ కార్గో హెచ్డీ, 6-టైర్ టిప్పర్లను పరిచయం చేసింది. ప్రారంభ ధర రూ.14.79 లక్షలుగా ఉన్నట్లు బుధవారం తెలియజేసింది. మరింత రవాణా సామర్థ్యం, అధిక మైలేజీ ఈ ట్రక్కుల సొంతమని ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది.