‘తెలుగు వర్ణమాల విత్ పోస్టేజ్ స్టాంప్స్, పిక్చర్ పోస్టల్ స్టాంప్స్’ను సోమవారం పోస్టల్ డిపార్ట్మెంట్ కార్యదర్శి ప్రదీప్త కుమార్ బిసోయి హైదరాబాద్లోని జీపీఏ కార్యాలయంలో విడుదల చేశారు. ఎక్స్క్యూసైట్ క్యుసైన్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో పిక్చర్ పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. ప్రధానంగా చిన్న పిల్లలు, పెద్దలు తెలుగును స్పష్టంగా నేర్చుకునేందుకు ఈ బుక్ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. అలాగే ‘ఎక్స్క్యూసైట్ క్యూసైన్ ఆఫ్ హైదరాబాద్’ అనే టైటిల్తో ‘మిర్చి కా సలామ్, హైదరాబాద్ దమ్ బిర్యాని, ఉస్మానియ బిస్కెట్, డబుల్ కా మీట, హైదరాబాద్ హలీం, కుబాని కా మీట, పాతర్ కా గోట్, బగారా బైంగన్, తలా హువా గోస్ట్, శిఖంపురి కబాబ్లపై పిక్చర్ పోస్టల్ కార్డులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంకు ఐఆర్పీఎస్ గోర్లి శ్రీనివాసరావు, పోస్ట్ మాస్ట్ జనకల్ పీవీఎస్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ అకౌంట్స్ యూ.సాయి పల్లవి పాల్గొన్నారు. ఈ బుక్, పోస్టల్ కార్డ్స్ ఈ నెల 21వ తేదీ నుంచి జీపీవో హైదరాబాద్తో పాటు అన్ని పోస్టాఫిసులలో అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. ఈ బుక్ ధర రూ.200 కాగా, పేపర్ ప్యాక్ మాత్రం రూ.100, అలాగే పిక్చర్ పోస్టల్ కార్డులు విత్అవుట్ కాన్సలేషన్ రూ.140, విత్ క్యాన్సలేషన్ రూ.200లకు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు.