ముంబై: గతవారం స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో నాలుగింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.65,464 కోట్లు పెరిగింది. గతవారం ట్రేడింగ్లో ఎయిర్టెల్, ఎస్బీఐ స్క్రిప్ట్లు అధిక లాభాలు గడించాయి. ఇక బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1.21 శాతం లేదా 710 పాయింట్లు పెరిగింది. గురువారం సెన్సెక్స్ 59 వేల మార్క్ను చేరుకున్నది. బీఎస్ఈ చరిత్రలో ఇదే ఫస్ట్టైం.
టాప్-10 సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ భారీగా లబ్ధి పొందాయి. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,984.14 కోట్లు పెరిగి రూ.3,99,901.97 కోట్లకు దూసుకెళ్లింది. మరోవైపు ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.19,500.28 కోట్లతో రూ.4,05,221.99 కోట్లకు పెరిగింది.
టీసీఎస్ ఎం-క్యాప్ రూ.14,315.33 కోట్లు పెరిగి రూ.14,16,903.13 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.8,664.66 కోట్లు ఎక్కువై రూ.8,76,597.86 కోట్లకు దూసుకెళ్లింది.
రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.43,746 కోట్లు నష్టపోయాయి. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.22,219.75 కోట్లు తగ్గిపోయి రూ.15,15,380.48 కోట్ల వద్ద స్థిర పడింది.
హిందూస్థాన్ యూనీ లివర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,605.92 కోట్లు తగ్గి రూ.6,39,335.53 కోట్లతో సరి పెట్టుకున్నది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.576.19 కోట్లు పడిపోయి, రూ.5,10,550.29 కోట్లకు చేరుకున్నది.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.212.1 కోట్లు తగ్గి రూ.7,17,427.09 కోట్లకు చేరుకున్నది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.90.54 కోట్లు పడిపోయి రూ.4,48,292.54 కోట్లతో స్థిర పడింది. ప్రైవేట్ బ్యాంకర్ ఐసీఐసీఐ బ్యాంక్ రూ.42.29 కోట్లు తగ్గి దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,99,176.68 కోట్లతో స్థిర పడింది.
టాప్-10 కంపెనీల్లో రిలయన్స్ లీడ్గా వ్యవహరిస్తున్నది. తర్వాతీ స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.