లక్నో: ఒక మోసగాడు ఫొర్జరీ పత్రాలతో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక వ్యక్తికి ఇల్లు విక్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అమ్రేంద్ర సోంకర్.. ప్రయాగ్ రాజ్ వాసి. 2018 నుంచి అమ్రేంద్ర సోంకర్ ఫొర్జరీ పత్రాలను ఉపయోగించి ప్లాట్లను విక్రయిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
లక్నోలో విలాసవంతమైన ప్రాంతాల్లో ప్లాట్ల పత్రాలను ఫొర్జరీ చేసి.. అనుమానం రాని వ్యక్తులను మోసగిస్తున్నాడని పోలీసు అధికారి చెప్పారు. అటుపై వారి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నాడని అన్నారు. విపుల్ ఖండ్లోని ప్లాట్ను బాధితుడికి నిందితుడు, రాజేశ్ కుమార్ రూ.1.2 కోట్లకు విక్రయిస్తున్నట్లు నమ్మించాడని పోలీసు అధికారి అన్నారు.
మోసాన్ని గుర్తించిన బాధితుడు.. తన డబ్బు తనకు ఇవ్వాలని కోరితే అమ్రేంద్ర సోంకర్ నిరాకరించడమే కాక బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్నోలోని లోహియా పార్క్ గేట్ నం-3లోని ఇంటి వద్ద నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.