న్యూఢిల్లీ: కరోనాతో ప్రజలు అల్లాడుతున్న వేళ.. దేశంలోనే ప్రముఖ మౌలిక వసతుల సంస్థ ఎల్ అండ్ టీ.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి దన్నుగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఆరు ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన చేసింది.
తొలి ఆక్సిజన్ ప్లాంట్ను తిరువల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. పొన్నేరి, తిరువల్లూరు ప్రభుత్వ దవాఖానలలో 500 ఎల్పీఎం (లీటర్స్ పర్ మినిట్) సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రంలోని మరో ఐదు చోట్లలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఎల్ అండ్ టీ వివరించింది. కరోనాపై పోరులో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) విధుల్లో భాగంగా తామీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
మదురై, తూత్తుకూడి, తిరునెల్వేలి, విరుద్ధ్ నగర్లతోపాటు చెన్నైల్లోని కరోనా కేర్ సెంటర్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మొబైల్ ఎక్స్రే యూనిట్లు, ఆక్సిజన్ వెంటిలేటర్లు సరఫరా చేస్తున్నట్లు ఎల్ అండ్ టీ చెప్పింది. దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
సెంట్రల్ బ్యాంక్, ఐఓబీలో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహలు
అన్లాక్ షురూ : మెట్రో రైల్, మార్కెట్లు ఓపెన్
కొవిడ్ చికిత్స నుంచి ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్ ఔట్.. సీటీ స్కాన్లూ వద్దు!
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు
కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్తోనే ఎక్కువ యాంటీబాడీలు!
మళ్లీ అమ్మాయి పుట్టిందని భార్యా పిల్లలను బావిలోకి తోసేసిన భర్త
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ ఎయిమ్స్లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
అధిష్ఠానం కోరితే రాజీనామా చేస్తా
జూలై 1 నుంచి బ్యాడ్ బ్యాంక్ ప్రారంభం?! ఎందుకంటే?!
చోక్సీ అప్పగింత డౌటేనా? అసలేం జరిగింది?!
స్వల్పకాలం కార్ల ధరలు స్టేబుల్: ఫోక్స్ వ్యాగన్