మెహిదీపట్నం జూలై 1: సమాజంలో మహిళలపై ఇంటా, బయట జరిగే ఆగడాలను అరికట్టడానికి స్త్రీ కౌ న్సెలింగ్ సెంటర్ ఎంతో దోహద పడుతుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ సమీపంలో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ కౌన్సెలింగ్ సెంటర్ను సీపీ.. అదనపు కమిషనర్ శిఖాగోయెల్, జాయింట్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీ అనిల్కుమార్, అదనపు డీసీపీలు శిరీష రాఘవేంద్ర, ఇక్బాల్ సిద్ధిఖీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మహిళలపై జరిగే అరాచకాలను అరికట్టడానికి రూపొందించిన కార్యక్రమం ‘స్త్రీ’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలో గృహహింసకు గురవుతున్న మహిళలను ఆదుకుంటామని చెప్పారు.
మహిళలకు కౌన్సెలింగ్ నిర్వహించి.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ఆ కుటుంబాల్లో సంతోషాన్ని పెంచడానికి ‘స్త్రీ’ కార్యక్రమం దోహదం చేస్తుందని అన్నారు. అనంతరం స్త్రీ కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్ను, పుస్తకాన్ని సీపీ.. ఎమ్మెల్యేతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్సీఎస్సి జాయింట్ సెక్రటరీ గీత, హెచ్సీఎస్సీ ప్రతినిధులు రాజశేఖర్, అనిందిత, నజ్ముద్దీన్, ఆసిఫ్నగర్, గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీలు శివమారుతి, కోటేశ్వర్ రావు, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ నసీరుద్దీన్ , స్త్రీ కార్యక్రమం వలంటీర్ సోఫియా తదితరులు పాల్గొన్నారు.