ముంబై: కరోనా రెండోవేవ్ నేపథ్యంలో రుణాల చెల్లింపుపై మారటోరియం విధించాలని ప్రధాని నరేంద్రమోదీని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కోరారు. జీఎస్టీ ఫైలింగ్ గడువును పొడిగించాలని అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. లాక్డౌన్ వేళ పేదలను ఆదుకునేందుకు స్టైఫండ్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం తొలి త్రైమాసికంలోనైనా రుణ వాయిదాల వసూళ్లను వాయిదా వేయాలని కోరుతూ బ్యాంకర్లను అభ్యర్థించాలన్నారు. చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపు దారులను ఆదుకునేందుకు మార్చి, ఏప్రిల్ నెలల్లో జీఎస్టీ ఫైలింగ్ గడువు మూడు నెలలు పెంచాలని కోరారు.
వచ్చే రెండు వారాల్లో 15రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు రెండింతలయ్యే ప్రమాదముందని ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5.64లక్షల యాక్టివ్ కేసులు ఉండగా, ఈ నెలాఖరు నాటికి ఈ సంఖ్య 11.9లక్షలకు చేరుతుందని లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో తగిన వసతులు కల్పించడానికి రాష్ట్రానికి సాయం చేయాలని కోరారు.
మహారాష్ట్రలోని వివిధ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే రోజుకు 1,200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఈ నెలాఖరు నాటికి 2వేల మెట్రిక్ టన్నులు అవసరం.
ఇతర రాష్ట్రాల నుంచి ద్రవ రూపంలో ఆక్సిజన్ రవాణాకు అడ్డంకులు అమలులో ఉన్నాయి. కనుక జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలని మోదీని ఉద్ధవ్ ఠాక్రే కోరారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నా, అత్యధిక ప్రభావం మహారాష్ట్రపైనే ఉన్న సంగతి తెలిసిందే. కరోనా విలయాన్ని ‘ప్రకృతి విపత్తు’గా పరిగణించాలని కేంద్రానికి ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
కొవిడ్పై పోరు.. ఫ్రీగా ఆక్సిజన్ పంపిస్తున్న ముకేశ్ అంబానీ
‘మోటో’లవర్స్ కి గుడ్ న్యూస్
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
మార్కెట్లోకి హైబ్రిడ్ ట్రాక్టర్
వాట్సాప్లో ఈ ట్రిక్స్ తెలుసా?
బైడెన్ ఎఫెక్ట్ : భారత టెక్, ఫార్మా కంపెనీలపై పన్ను భారం
ఫ్లిప్కార్ట్ చేతికి క్లియర్ ట్రిప్
ఆదాయంలో అంచనాలు దాటిన విప్రో
ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్.. 36 పరుగులకే 3 వికెట్లు