‘ప్రింట్ టు పోస్ట్’ ఒప్పందం
హైదరాబాద్, సెప్టెంబర్ 27: తపాలా శాఖతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఒప్పందం కుదుర్చుకున్నది. సోమవారం ముంబైలో జరిగిన ఈ అగ్రిమెంట్ కార్యక్రమంలో ఇరు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రింట్ టు పోస్ట్ సొల్యూషన్స్ కోసం ఈ అగ్రిమెంట్ను పోస్టల్ శాఖతో ఎల్ఐసీ ఏర్పర్చుకోగా, ఇందులో భాగంగా జీవిత బీమా పాలసీ కింద జారీ చేసే పాలసీ బుక్లెట్ ముద్రణ, పంపిణీని తపాలా శాఖనే చూసుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ చైర్పర్సన్ ఎంఆర్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్లు ముకేశ్ కుమార్ గుప్తా, రాజ్ కుమార్, మినీ ఐపే, పోస్టల్ డైరెక్టరేట్ (న్యూఢిల్లీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అజయ్ కుమార్ రాయ్, తెలంగాణ సర్కిల్ పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ కేఏ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.