న్యూఢిల్లీ: భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో యాంకర్ ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించి రూ.25 వేల కోట్ల నిధులు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు వెళ్లాలని భావిస్తున్నది.
ఐపీవోకు వెళ్లడానికి ముందు బోర్డు వ్యవస్థలోనూ, అక్కౌంటింగ్లో నూతన ప్రమాణాలను ఎల్ఐసీ అమలులోకి తీసుకు రానున్నది. షేర్ విలువ మదింపు పూర్తి చేసి, ప్రైసింగ్ సిద్ధమైన తర్వాత ఐపీవోకు వెళ్లనున్నదని సమాచారం.
ఈ ఐపీవోలో సుమారు 24 మంది యాంకర్ ఇన్వెస్టర్లను ఎల్ఐసీ ఆహ్వానించనున్నట్లు అధికార వర్గాల కథనం. కనీసం దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీలో 10 శాతం వాటా కనీసం రూ. లక్ష కోట్లు ఉంటుంది. ఇది భారత ఈక్విటీ మార్కెట్లోనే అత్యధికం.
యాంకర్ ఇన్వెస్టర్లు అంటే క్వాలిఫైడ్ ఇన్స్ట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) అని అర్ధం. వీరు ఎల్ఐసీలో ఒక భాగం వాటాలను యాంకర్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తారు.
ఇదిలా ఉంటే రాజ్యాంగ పరంగా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కావడానికి వీలుగా ఎల్ఐసీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం సెబీ నిబంధనలకు అనుగుణంగా ఎల్ఐసీ బోర్డు నియామకం కాలేదు. సెబీ నిబంధనలకు అనుగుణంగా ఎల్ఐసీ బోర్డులో మార్పుల దిశగా చర్యలు చేపట్టారు.
ఐపీవో ప్రక్రియ కోసం మర్చంట్ బ్యాంకర్లు, అడ్వైజర్లు, రిజిస్ట్రార్ను నియమించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెబీ నిబంధనల ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లు స్పెసిఫిక్ ధరపై రూ.10 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. యాంకర్ ఇన్వెస్టర్లకు 30 రోజుల లాక్ ఇన్ పీరియడ్లో షేర్లు కొనవచ్చు.