న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ…సరికొత్తగా ‘ఆనంద్ మొబైల్ యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త యాప్ను బుధవారం కంపెనీ చైర్పర్సన్ ఎంఆర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సంస్థకు చెందిన ఏజెంట్లకు నూతన బిజినెస్ డిజిటల్ అప్లికేషన్, పేపర్లెస్ సొల్యుషన్ అందించడంలో భాగంగా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.