సిటీ క్రిమినల్ కోర్ట్, నాంపల్లి, జూన్ 25(నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లోక్ అదాలత్ను నిర్వహిస్తోందని నాంపల్లి సెషన్స్ జడ్జీ జి.తుకారాం తెలిపారు. పరిష్కారం చేసుకోదగిన కేసుల కోసం ఈ లోక్ అదాలత్ను జూలై 10వ తేదీన (రెండో శనివారం) నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో చెక్బౌన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, వివాహ సంబంధమైన కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. నాంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని కోర్టులో విచారణ ఉంటుందని, పోలీసు అధికారులు, బ్యాంక్ ఆఫీసర్లు, న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే జాతీయ లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించుకోవాలన్నారు. ఈ లోక్ అదాలత్ భౌతిక, దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు.