LIC IPO | ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎప్పుడు వెళుతుందో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు. ఎల్ఐసీని ఐపీవోకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై ఆచితూచి స్పందించాలని అనుకుఓవడం లేదన్నారు. అయితే ఎల్ఐసీ ఐపీవోకు ప్రాసెస్ ఉంటుందని తెలిపారు.
ఎల్ఐసీ వంటి కంపెనీ ఆర్థిక పరిమాణం ఎంత అన్న విషయాన్ని ఏడాదికోసారి అంతర్గతంగా మదింపు చేయాల్సిందన్నారు నిర్మలా సీతారామన్. కానీ ఇప్పటివరకు అది జరుగలేదని చెప్పారు. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఎల్ఐసీ ఐపీవోకు వెళుతుందని, రాజకీయ చిత్తశుద్ధి లోపం వల్లే జాప్యం జరుగడం లేదన్నారు.
గత నెలలో అప్పటి ఆర్థికశాఖ ప్రధాన సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణ్యం స్పందిస్తూ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎల్ఐసీ.. ఐపీవోకు వెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ లిస్టింగ్ కోసం ప్రభుత్వం ఎల్ఐసీ చట్టానికి ఇంతకుముందు సవరణ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం ఇందులో ప్రభుత్వ వాటా 75 శాతంగా ఉంటుంది.