న్యూఢిల్లీ, జూన్ 30: ప్రైవేట్ రంగ ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్ దివాలా కేసులో రుణదాతలు నిండా మునిగారు. ఇచ్చింది రూ.7,807 కోైట్లెతే.. దక్కుతున్నది మాత్రం రూ.380 కోట్లే మరి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదించిన రిజల్యూషన్ ప్లాన్ ప్రకారం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ను దక్కిం చుకున్న జలాన్ కల్రాక్ కన్సార్టియం.. సంస్థలోకి రూ.1,375 కోట్లనే తెస్తున్నది. దీంతో బ్యాంకర్లు తీవ్రంగా నష్టపోయారు. జెట్ ఎయిర్వేస్లోకి తెస్తున్న ఈ నిధుల్లో రూ.900 కోట్లను ఎయిర్లైన్ కార్యకలాపాల కోసం మూలధన వ్యయం, అవసరాలకు కన్సార్టియం కేటాయించింది. మిగిలిన రూ.475 కోట్లనే రుణదాతలుసహా ఇతర స్టేక్హోల్డర్స్కు పంచనున్నారు. ఫైనాన్షియల్ క్రెడి టార్లకు దక్కుతున్నది రూ.380 కోట్లే. దీంతో జెట్ కేసులో 95 శాతం వదులుకున్నట్లవుతున్నది. కాగా, జూన్ 22న ఎన్సీఎల్టీ ఆమోదించిన ఈ ప్లాన్ వివరాలను బుధవారం ట్రిబ్యునల్ విడుదల చేసింది.