హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): అన్నివర్గాల ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏండ్లకు పెంచినందుకు టీజీవో ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపింది. మంగళవారం టీజీవో కార్యాలయంలో అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పదోన్నతి కాలపరిమితిని కుదించడం, రిటైర్డ్ ఉద్యోగులకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 70 ఏండ్లకు కుదిం పు, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్పై సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు సహదేవ్, రవీంద్రకుమార్, రవీందర్రావు, నగరశాఖ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు వినయ్కుమార్, రాజ్కుమార్గుప్తా, వెంకట య్య, అరుణ్, సుజాత, సబిత, ప్రణయ్, శ్రీనివాస్రెడ్డి, నర్సింహులు, యాదగిరి, హరికృష్ణ, స్వరూపరాణి, లావణ్య, రంజిత్కుమార్, ఆనంద్కుమార్, గోపాల్నాయక్, గోపీచంద్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి
ప్రపంచ బట్టతల సోగ్గాడు.. ప్రిన్స్ విలియం
అధ్యక్షుడి చివరి చూపు కోసం వచ్చి 45 మంది మృతి