ప్రవేశపెట్టిన మున్సిపల్ చైర్మన్ నర్సింహులు
ప్లాన్కింద రూ.46.49 కోట్లు, నాన్ప్లాన్ కింద రూ.86.90 కోట్లు
విలీన గ్రామాలకు ప్రాధాన్యం
సీఎం కేసీఆర్ను ఒప్పించి పెద్ద చెరువుకు కృష్ణా జలాలు : మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ టౌన్, మార్చి 31 : మహబూబ్నగర్ మున్సిపల్ 2021-22 బడ్జెట్ను రూ.133.39 కోట్లతో రూపొందించగా బుధవారం మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు ప్రవేశపెట్టారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ సమావేశ మందిరం లో జరిగిన సమావేశానికి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బడ్జెట్కు సభ్యులం తా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. బడ్జెట్లో రూ.46.49 కోట్లు ప్లాన్ కాగా, రూ. 86.90 కోట్లు నాన్ప్లాన్ కింద అంచనా వేశారు. బడ్జెట్లో 10 శాతం గ్రీన్బడ్జెట్ కు కేటాయించారు. విలీన గ్రామాలకు బ డ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు. బడ్జెట్కు అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయి.
ట్యాంకుబండ్కు కృష్ణా జలాలు : మంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించైనా మినీ ట్యాంక్బండ్గా మారిన కొత్త చెరువుకు కృష్ణా జలాలు తీసుకొచ్చేందుకు కృ షి చేస్తానని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపా రు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని, ముఖ్యమంత్రి ఆమోదం తీసుకున్న వెంటనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పా రు. పట్టణం చుట్టూ మూడువైపులా పెద్ద నదిలా కాలువల ద్వారా నీరు పారేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కాలువలు దాటుతూనే ప్రజలు పట్టణంలోకి రావాలన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏ ర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప నులు పూర్తయితేనే నా కల నిజమవుతుందన్నారు. ట్యాంక్బండ్ కింద అంతే స్థా యిలో కట్ట నిర్మాణం చేపట్టి వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా కేం ద్రంలో రహదారి పనులు కొనసాగుతున్నాయని, మధ్యలో గుడి, మసీదులు ఉన్నాయని వాటిని పక్కకు జరిపి, అంతకన్నా ఎక్కువ స్థలం కేటాయించి, బ్ర హ్మాండంగా వాటిని పునర్నిర్మిస్తామన్నా రు. ఇందుకు ఇరువురు అంగీకారంతో వస్తేనే సాధ్యమవుతుందన్నారు.
కొంతమంది వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అప్పన్నపల్లి వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణం చేపడుతుంటే కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని, కేసు లు వేసి ఆపే ప్రయత్నాలు చేస్తున్నా వారి ని ఒప్పించి పనులు చేపడుతున్నామన్నా రు. పట్టణంలో ఐదు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇండోర్ స్టేడి యం ఏర్పాటుకు త్వరలోనే టెండర్లు పి లుస్తామన్నారు. వీరన్నపేట డబుల్బె డ్రూం ఇండ్ల వద్ద రూ.వంద కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా దివిటిపల్లి, ఎదిర వద్ద రూ.2 వేల కో ట్లతో గ్రీన్పార్క్ ఎలక్ట్రికల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ నర్సింహులు మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి వార్డులో సమస్యలు పరిష్కరిస్తామ ని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, డీఎస్పీ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ షబ్బీర్ అహ్మద్, కౌన్సిల్ స భ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
దవాఖానల్లో మళ్లీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు