హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో నేడు మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులను ప్రారంభిస్తారు. సర్వే పనులను ఆరంభిస్తారు. సంగమేశ్వర ద్వారా జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అదించనున్నారు.