గ్రామంలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తా
సర్పంచుల సంఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్
జడ్చర్ల, మే7: సెకండ్వేవ్లో కరోనా మహమ్మారి విస్తురిస్తున్న నేపథ్యంలో జడ్చర్ల మండలం నసరుల్లాబాద్ గ్రామంలో సర్పంచ్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా శుక్రవారం గ్రామంలో ప్రతి ఇంటి ఆవరణ, రోడ్లపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. గ్రామంలో తిరుగుతూ కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ప్రణీల్చందర్ మాట్లాడుతూ గ్రామంలోనే పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే ఇండ్లల్లో కాకుండా ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందించనున్నట్లు వివరించారు. కరోనాకు ప్రజలు భయపడొద్దని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఉప సర్పంచ్ నరేందర్, వార్డు సభ్యులు నిజాం, వెంకటేశ్, మనోహర్, శ్రీశైలం ఉన్నారు.