ముంబై : కొటక్ మహింద్ర అసెట్ మేనేజ్మెంట్ కు చెందిన కొటక్ మహింద్ర పెన్షన్ ఫండ్ లో 46.7 శాతం వాటా కొనుగోలు చేసినట్టు కొటక్ మహింద్ర బ్యాంక్ సోమవారం వెల్లడించింది. కొటక్ మహింద్ర బ్యాంక్ కేఎం పెన్షన్ ఫండ్ లో రూ 12.10 కోట్ల విలువైన 1.3 కోట్ల షేర్లను సొంతం చేసుకుంది.
ఈ ఒప్పందం అనంతరం కేఎం పెన్షన్ ఫండ్ కొటక్ మహీంద్ర బ్యాంక్ అనుబంధ సంస్ధగా మారిందని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహింద్ర బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు సమాచారం అందించింది.