న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరిలో కొమకి ఎలక్ట్రిక్ వెహికల్స్ తమ తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్ను లాంఛ్ చేయనుంది. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధ కొమకి భారత్లో ప్రస్తుతం నాలుగు ఎలక్ట్రిక్ బైక్లను విక్రయిస్తోంది. న్యూ ఎలక్ట్రిక్ క్రూజర్ కస్టమర్లకు మెరుగైన శక్తివంతమైన డ్రైవింగ్ అనుభూతిని ఇవ్వడంతో పాటు అధిక మైలేజ్ను ఇస్తుందని స్టైలిష్ లుక్తో అందుబాటు ధరలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.
దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా న్యూ క్రూజర్ బైక్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్లో తొలి క్రూయిజ్ ఈవీ బైక్ తమదేనని, ఈ సెగ్మెంట్లో తమ క్రూయిజ్ బైక్ కస్టమర్లు కోరుకునే రీతిలో అందుబాటులోకి వస్తుందని కొమకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా వెల్లడించారు.