న్యూఢిల్లీ, ఆగస్టు 4: తీవ్రనష్టాలతో సతమతమవుతున్న టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడి యా (వీఐఎల్) డైరెక్టర్ల బోర్డు నుంచి ఆదిత్యాబిర్లా గ్రూప్ అధినేత కుమార్మంగళం బిర్లా నుంచి పూర్తిగా తప్పుకున్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా బిర్లా వైదొలిగినట్లు కంపెనీ తెలిపింది. బోర్డు నుంచి తప్పుకుంటానన్న కుమార్మంగళం బిర్లా వినతిని బుధవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు ఆమోదించిందని, ఆదిత్యాబిర్లా గ్రూప్ నామినీ అయిన హిమాన్షు కపానియాను నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నియమించినట్లు వీఐఎల్ పేర్కొంది. టెలికాం రంగంలో 25 సంవత్సరాల అనుభవం కలిగిన కపానియా సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పనిచేశారు. వీఐఎల్లో ఆదిత్యా బిర్లా గ్రూప్నకు దాదాపు 28 శాతం వాటా ఉంది. 44 శాతం వాటా యూరప్ టెలికాం దిగ్గజం వొడాపోన్ వద్ద ఉంది.
27 కోట్ల మంది కస్టమర్లను కలిగిన వొడాఫోన్ ఐడియా మనుగడ సాగించేందుకు కంపెనీలో తనకున్న పూర్తి వాటాను ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా ఇవ్వడానికి సిద్ధమేనని కేంద్ర ప్రభుత్వానికి కుమార్మంగళం బిర్లా లేఖ రాసారు. భారీ ఏజీఆర్ బకాయిలు, తక్కువ టెలికం టారీఫ్లు వొడాఫోన్ ఐడియాను కృంగదీసాయని, టెలికం పరిశ్రమకు ఊరట కల్గించే చర్యల్ని తీసుకోవాలని బిర్లా ప్రభుత్వా న్ని కోరారు. కంపెనీ మనుగడకు రూ.25,000 కోట్ల నిధులు అవసరమని, ఏజీఆర్ బకాయిల్ని తిరిగి లెక్కించడం, కనీస టెలికాం టారీఫ్ను నిర్ణయించడం వంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకుంటేనే తాము అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించగలమని బిర్లా ప్రభుత్వానికి వివరించారు.