న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక సంస్థ కిర్లోస్కర్ గ్రూప్ కుటుంబ సభ్యుల మధ్య సుదీర్ఘ కాలం వివాదం కొనసాగడం వారి కంపెనీకి, పరిశ్రమకు లబ్ది చేకూరదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల ఉమ్మడి స్నేహితుల మధ్యవర్తిత్వంతో వివాద పరిష్కారానికి చొరవ చూపాలని మంగళవారం సూచించారు. కిర్లోస్కర్ కుటుంబ సభ్యుల మధ్య సుదీర్ఘ కాలంగా వివాదం కొనసాగుతున్నది.
పేరొందిన వ్యాపార కుటుంబం మధ్య ఏండ్ల తరబడి వివాదం కొనసాగడం వారికి మంచిది కాదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఇరు పక్షాలు అంగీకరిస్తే, మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ సారధ్యంలోని ధర్మాసనం ప్రతిపాదించింది.
ఈ వివాదంపై బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ (కేబీఎల్) సీఎండీ సంజయ్ కిర్లోస్కర్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ సారధ్యంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
ఈ వివాదాన్ని ఆర్బిట్రేషన్కు పంపాలని బాంబే హైకోర్టు గత నెల 21న ఆదేశించింది. దీన్ని సంజయ్ కిర్లోస్కర్ వ్యతిరేకిస్తూ, సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తాజా మధ్యవర్తిత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పుణెలోని సివిల్ కోర్టు ఆదేశం మేరకు డీడ్ ఫర్ ప్యామిలీ సెటిల్మెంట్ (డీఎఫ్ఎస్) అమలు చేయాలని పట్టుబడుతున్నారు.
Conflict in Hero Family| హీరో ఫ్యామిలీలో రచ్చ.. ‘ముంజాల్స్’లో విభేదాలు.. ఎందుకంటే?!
ఉజ్జయిని ఆలయం వద్ద భక్తుల తొక్కిసలాట..
కాంగ్రెస్ బండారాన్ని బయటపెట్టండి.. బీజేపీ ఎంపీలతో ప్రధాని
అమెరికాలో గజినీ… భార్యాబిడ్డలనే మరచిపోయాడు
సునంద పుష్కర్ మృతి కేసు.. తీర్పు ఆగస్టు 18కి వాయిదా..!
ఇంకా విషమంగానే మాజీ సీఎం ఆరోగ్యం..!
మద్రాస్ హైకోర్టులో నటుడు విజయ్కి ఊరట..!
భారత్కు శుభవార్త.. ప్రపంచ వారసత్వ సంపదగా ధోలవిర.. ప్రకటించిన యునెస్కో
బిట్కాయిన్ చెల్లింపులకు ఆమోదంపై అమెజాన్ వివరణ