న్యూఢిల్లీ : ఆటో ఎక్స్పోలో కియా ప్రదర్శించిన కియా సెల్టోస్ ఎక్స్ లైన్ వేరియంట్ త్వరలో భారత్ మార్కెట్లోకి రానుంది. ప్రాజెక్ట్ ఎక్స్ను త్వరలో లాంఛ్ చేస్తామని కియా ఇటీవల వెల్లడించింది. కియా సెల్టోస్ ఎక్స్ లైన్ మోడల్లో ఎంట్రీ ఇచ్చే ఎస్యూవీ వేరియంట్లపై దేశీ మార్కెట్లో అంచనాలు జోరందుకున్నాయి.
ఎక్స్ లైన్ ఫీచర్ల విషయానికి వస్తే మాస్క్యులర్ ఫ్రంట్ బంపర్, బ్రాంజ్ ఫినిష్తో కూడిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, బ్లాక్డ్ అవుట్ అలాయ్ వీల్స్, గ్రే ఎక్స్టీరియర్ కలర్తో ఆకట్టుకోనుంది. ఇక ఎస్యూవీ లోపల డిఫరెంట్ ప్యాట్రన్తో లెదర్ సీట్స్ ఆకర్షణీయంగా ఉంటాయని చెబుతున్నారు. క్యాబిన్లో పెద్దగా మార్పులుండవని తెలుస్తోంది.
కియా ఎక్స్ లైన్ వేరియంట్స్ ధర స్టాండర్డ్ జీటీ లైన్ వేరియంట్స్ కంటే కొంచెం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎక్స్ లైన్ వేరియంట్స్లో ఫీచర్ల గురించి కియా అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడంతో ఈ వేరియంట్ ధర, ఇతర వివరాలపై వాహనదారుల్లో ఆసక్తి పెరుగుతోంది.