హైదరాబాద్, ఆగస్టు 16: స్టీల్, పెయింట్స్ తయారీ సంస్థ కామధేను లిమిటెడ్..తెలంగాణలో ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నది. దక్షిణాదిలో కంపెనీకి చెందిన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో షాద్నగర్, వికారాబాద్ వద్ద ఉన్న స్టీల్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 25 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సామర్థ్యం 1.9 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.4 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనున్నది. ‘తెలంగాణ మార్కెట్ మాకు చాలా కీలకం. ఇక్కడ మౌలిక, నిర్మాణ రంగాలు భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. దీంతో స్టీల్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సామర్థ్యాన్ని మరింతా పెంచాలని నిర్ణయించాం’ కంపెనీ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ తెలిపారు.