హైదరాబాద్, ఆగస్టు 18: ప్రముఖ జ్యుయెల్లరీ సంస్థ జోయాలుక్కాస్ పెండ్లిండ్ల సీజన్ సమీపిస్తున్న క్రమంలో మరోసారి బ్రైడల్ ఫెస్ట్ను తీసుకొచ్చింది. తద్వారా నగల కొనుగోళ్లలో మరిన్ని ఆఫర్లను తమ కస్టమర్లకు అందించింది. పరిమిత కాలవ్యవధి కలిగిన ఈ బ్రైడల్ ఫెస్ట్ కింద ఎన్నో కొత్త, సంప్రదాయ కలెక్షన్లను అందుబాటులో ఉంచామని తాజా ప్రకటనలో జోయాలుక్కాస్ తెలియజేసింది. కాగా, బ్రైడల్ ఫెస్ట్లో భాగంగా ఓ ప్రత్యేక వెడ్డింగ్ ప్యాకేజీని ప్రకటించిన జోయాలుక్కాస్.. ఇందులో అన్ని నగలపై మేకింగ్ చార్జీల్లో 30 శాతం తగ్గింపును పొందవచ్చని పేర్కొన్నది. కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సంస్థ తెలియజేసింది.