న్యూఢిల్లీ, జూన్ 15: రిలయన్స్ జియో ఈ నెల 17 నుంచి జియోఫైబర్ పోస్ట్-పెయిడ్ బ్రాడ్బాండ్ సేవల్ని ప్రారంభిస్తున్నది. కొత్త కనెక్షన్లకు ఇన్స్టాలేషన్ చార్జీలుండవని ప్రకటించింది. అయితే 6 లేదా 12 నెలల ప్లాన్లను కస్టమర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. నెలసరి ధర రూ.399గా ఉన్నది. ఇక ప్రస్తుతం కొత్త కనెక్షన్దారులకు రూ.1,500 ఇన్స్టాలేషన్ చార్జీ వసూలు చేస్తున్నారు. కాగా, ఓటీటీ సౌకర్యమున్న ప్లాన్లను ఎంచుకుంటే రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్గా కస్టమర్లు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.