న్యూఢిల్లీ, జూన్ 11: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ఐదు ప్లాన్లను పరిచేయం చేసింది. దీంట్లో ‘నో డెయిలీ లిమిట్’ ప్రీపెయిడ్ మొబిలిటీ ఆఫర్లను ఆఫర్ చేస్తున్నది. వీటిలో 15 రోజుల కాలపరిమితి కలిగిన ప్లాన్ను రూ.127కి అందిస్తున్నది. జియో ఫ్రీడమ్ పేరుతో ప్రకటించిన ఈ ప్లాన్లతో మరింత మందిని డిజిటల్ విభాగంలోకి రప్పించడానికి వీలు పడనున్నదని తెలిపింది. డాటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పించింది.