హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను పీఆర్టీయూ నాయకులు కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎంకు వారు వినతిపత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజన పూర్తి చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని సీఎంను కోరారు. అలాగే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల పున: ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని, ఆన్లైన్లోనే విద్యాబోధన కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 50శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా ఆదేశించాలని సీఎం కేసీఆర్కు పీఆర్టీయూ నాయకులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తం రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.