హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన కే నాగరాజ్ నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ నేషన్స్లో భారత డిప్యూటీ అంబాసిడర్గా పనిచేస్తున్న 1998 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన కే నాగరాజ్ నాయుడు ఇటీవల నిర్వహించిన యూఎన్ జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) 76వ సమావేశంలో చెఫ్డీ క్యాబినెట్ ఆఫ్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. యూఎన్జీఏ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ నాగరాజ్నాయుడును ఎంపిక చేశారు. ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ దౌత్యవేత్తగానూ ఆయన ఘనత సాధించారు. నాయుడుకు హైదరాబాద్తో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన 1990లో సికింద్రాబాద్ సెంట్ పత్రిక్స్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. 1995లో నిజాం కాలేజ్ నుంచి ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1998లో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యారు. 2019లో యూఎన్ శాశ్వత కమిషన్లో సెకండ్ ఇన్ కమాండ్గా బాధ్యతలు నిర్వర్తించారు.