హైదరాబాద్, ఏప్రిల్ 26: బీమా దిగ్గజం ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్గా ఎం జగన్నాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు ఈ జోనల్ పరిధిలో ఉన్నాయి. కామర్స్ పట్టా పొందిన జగన్నాథ్..సీఏ(ఇంటర్), మార్కెటింగ్లో పీజీ డిప్లామా, లైఫ్ ఇన్సూరెన్స్లో ఇంటర్నేషనల్ పీజీ డిప్లామా చేశారు. అంతకు ముందు ఆయన సౌత్ సెంట్రల్ జోన్ కర్ణాటక యూనిట్లో రీజినల్ మేనేజర్(మార్కెటింగ్) విధులు నిర్వహించగా, అలాగే హైదరాబాద్, రీజినల్ మేనేజర్(బ్యాంకాస్సురెన్స్) హైదరాబాద్ కూడా పనిచేశారు. 1988లో ఎల్ఐసీలో చేరిన ఆయన..అంచెలంచెలుగా ఎదిగారు.