హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : సకాలంలో పన్నులు చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ విజేత పీవీ సింధు పేర్కొన్నారు. పన్నులతోనే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీకి అమృత్ మహోత్సవ్’లో భాగంగా హైదరాబాద్లోని కేంద్ర ఆదాయపన్ను శాఖ ‘ఆజాదీ కా జన్ ఉత్సవ్’ పేరుతో శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, కార్తికేయ ఇండస్ట్రీస్ సీఎండీ భగవతి దేవి బాల్దవను ‘ఉత్తమ పన్ను చెల్లింపుదారు’గా గుర్తించి సన్మానించారు.