న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 30 మధ్య 23.99 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూ 67,401 కోట్ల విలువైన రిఫండ్స్ జారీ చేసిందని ఆదాయ పన్ను శాఖ శనివారం వెల్లడించింది. వీటిలో రూ 16,373 కోట్లు ఐటీ రిఫండ్లు కాగా, రూ 51,029 కోట్లు కార్పొరేట్ పన్ను రిఫండ్లు ఉన్నాయని తెలిపింది.
ఐటీ శాఖ న్యూ ఈ ఫైలింగ్ పోర్టల్తో పన్ను చెల్లింపుదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్న క్రమంలో ఈస్ధాయిలో రిఫండ్లు జారీ కావడం ఊరట కలిగిస్తోంది. ఈ ఫైలింగ్ పోర్టల్లో సమస్యలతో పలువురు పన్ను చెల్లింపుదారులు ఇప్పటివరకూ తమ ఐటీ రిటన్సను సమర్పించలేదు. సాధారణంగా ఐటీ రిటన్ దాఖలు చేసిన పదిరోజుల్లోగా రిఫండ్స్ను జారీ చేస్తారు. ఇక ఇప్పటివరకూ మీకు రిఫండ్ రాకుంటే ఐటీ శాఖ వెబ్సైట్ incometaxindia.gov.inలో మీ రిఫండ్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు.