work from home | ఐటీ రంగ సంస్థలు ఈ ఏడాదిలోనే వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నాయని హైసి యా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) సర్వేలో తేలింది. ‘ఫ్యూచర్ వర్క్ మోడల్’ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో చిన్నతరహా కంపెనీలు ఇప్పటికే 20% ఉద్యోగులతో వర్క్ ఫ్రం ఆఫీస్ను ప్రారంభించినట్లు స్పష్టమైంది. ఇక ప్రస్తుత గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా హైబ్రిడ్ విధానంలో పని చేయించేందుకు 70% కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఈ ఏడాది డిసెంబర్ నాటికి 73% కంపెనీలు కనీసం 10-50% మందితో వర్క్ ఫ్రం ఆఫీస్ ప్రారంభించాలని యోచిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చికల్లా 79% కంపెనీలు గరిష్ఠంగా 90% ఉద్యోగులతో వర్క్ ఫ్రం ఆఫీస్ ప్రారంభించాలని అనుకుంటున్నాయి. తమ ఉద్యోగులు కనీసం ఒక్క డోసు వ్యాక్సినైనా తీసుకునే ఉండొచ్చని 84% కంపెనీలు భావిస్తునట్లు తాజా హైసియా సర్వేలో వెల్లడైంది.
ఉద్యోగాల భర్తీలో వ్యాక్సిన్ సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంటుందని కంపెనీలు అభిప్రాయపడ్డాయి. వ్యాక్సినేషన్ ఎక్కువగా ఉంటే ఆఫీస్కు వచ్చే ఉద్యోగుల్లో ైస్థెర్యాన్ని నింపుతుందన్నాయి. ఇక పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలను కొనసాగించాలని సూచించాయి. కాగా, సెజ్ల్లో ఉన్న కంపెనీల్లో వర్క్ ఫ్రం ఎనీవేర్ను ప్రభుత్వం అనుమతించాలని కంపెనీలు కోరాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ఐటీ కంపెనీలకు 9-12 శాతం రెవిన్యూ వృద్ధికి వీలున్నా.. అధిక వేతనాలతో లాభాలు తగ్గవచ్చని మంగళవారం ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ ఉపాధ్యక్షుడు గౌరవ్ జైన్ అంచనా వేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బంపరాఫర్.. బహుమతులుగా బీఎండబ్ల్యూ బైక్స్.. ఐ-ఫోన్లు..!!
వొడాఫోన్పై దెబ్బ మీద దెబ్బ.. బిర్లా లేఖ ఎంత పని చేసింది?!
Anand Mahindra : అబ్బ.. ఆదివారం కూడా వ్యాయామం చేయాలా? అనేవాళ్లు ఈ వీడియో చూడండి