జెరూసలేం: ఇజ్రాయెల్లో తాజాగా మరో ఇండియన్ వేరియంట్ కరోనా కేసు వెలుగు చూసింది. దీంతో ఇజ్రాయెల్లో బయటపడిన ఇండియన్ వేరియంట్ పేషంట్ల సంఖ్య ఎనిమిదికి చేరుకున్నది. దీనికి వ్యతిరేకంగా ఫైజర్ లేదా బయోటెక్ వ్యాక్సిన్ బాగా పని చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోగ్య అధికారి ఒకరు చెప్పారు.
విదేశాల నుంచి వచ్చిన వారికి నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఏడుగురికి ఇండియన్ వేరియంట్ ఉన్నట్లు తేలిందని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా మంగళవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో మరొకరికి ఇండియన్ వేరియంట్ కరోనా సోకిందని తేలింది.
ఇండియన్ వేరియంట్ కరోనా వైరస్ను నియంత్రించడానికి ఫైజర్ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పని చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ హెజీ లేవీ చెప్పారు. దీనిపై వివరణ అడిగిన రాయిటర్ ప్రతినిధికి దేశ ఆరోగ్యశాఖ స్పందించలేదు.
బ్రిటన్, ఐర్లాండ్ దేశాలు తమ సరిహద్దుల్లోనే ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇజ్రాయెల్ జనాభా 93 లక్షలు. ఇప్పటి వరకు 16 ఏండ్లలోపు పిల్లలతోపాటు 81 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు