బెంగళూరు: దేశ అంతరిక్ష పరిశోధనా రంగం క్రమంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నదా? అవుననే సమాధానం వస్తున్నది. ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఉపయోగించే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ (పీఎస్ఎల్వీ) తయారీ కాంట్రాక్ట్ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఇప్పటి వరకు దీన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహించింది.
ఈ పీఎస్ఎల్వీలను తయారు చేసే కాంట్రాక్ట్ కోసం ఆదానీ గ్రూప్, ఎల్ అండ్ టీ కన్సార్టియం పోటీ పడుతున్నాయి. ఎల్ అండ్ టీ సారధ్యంలోని కన్సార్టియంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) సింగిల్ కంపెనీగా బిడ్స దాఖలు చేసింది.