ముంబై : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తొలి త్రైమాసికం ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఐఆర్సీటీసీ నష్టాల నుంచి లాభాల బాట పట్టింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.82.5 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.24.6 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 84.8 శాతానికి పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఆదాయం రూ.132 కోట్ల నుంచి రూ.224 కోట్లకు పెరిగింది.
ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ఐఆర్సీటీసీ బోర్డు వాటా విభజనను ఆమోదించింది. దీంతో ఐఆర్సీటీసీ ఒక వాటా 5 వాటాలుగా విభజించబడుతుంది. రూ.10 ముఖ విలువ కలిగిన వాటాను 5 గా విభజించినట్లయితే, దాని ముఖ విలువ రూ.2 అవుతుంది. ఈ ప్రతిపాదనను ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖకు పంపారు. క్యాటరింగ్ విభాగం నుంచి ఆదాయం 37 శాతం క్షీణించింది. క్యాటరింగ్ విభాగం నుంచి వచ్చే ఆదాయం సంవత్సరానికి రూ.89 కోట్ల నుంచి రూ.56 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ ద్వారా వచ్చే ఆదాయం 300 శాతం పెరిగి, రూ.149 కోట్లకు చేరింది. గురువారం బీఎస్ఈలో 4.60 శాతం లాభంతో ఐఆర్సీటీసీ షేర్లు 2,689.85 వద్ద ముగిశాయి.
మోదీకి చెక్ పెట్టేందుకు విపక్షాల సన్నాహాలు
గ్యాస్ సబ్సిడీ అందట్లేదా..? ఇలా ప్రయత్నించండి!
చైనా, పాక్ సరిహద్దుల్లో ‘డేగకన్ను’
మాజీ ఉపాధ్యక్షుడి కుమారుడు కిడ్నాప్
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
ఒలింపిక్స్లో భారత్కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?
కూరగాయలను సబ్బుతో కడుగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
డయాబెటిస్ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..