న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ( IRCTC ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లకు చేరింది. ఆ సంస్థ మంగళవారం ఈ మార్క్ను అందుకుంది. ఐఆర్సీటీసీ షేరు ధర తొలిసారి రూ.6 వేలు దాటింది. దీంతో ఆ సంస్థ ఎంక్యాప్ రూ.1,00,285.60 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఐఆర్సీటీసీ షేరు ధర ఏకంగా 300 శాతం పెరగడం విశేషం. 9 నెలల్లోనే ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30 వేల కోట్లు పెరిగింది.
గతంలో ఎస్బీఐ, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థ రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అందుకున్నాయి. అక్టోబర్ 14, 2019న తొలిసారి రూ.320 షేరు ధరతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది ఐఆర్సీటీసీ. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 18 రెట్లు పెరిగింది.