కట్టంగూర్(నకిరేకల్)/ కేతేపల్లి/ చిట్యాల, జూన్ 29 : శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జన్మదిన వేడుకలను మంగళవారం నకిరేకల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నకిరేకల్ మెయిన్ సెంటర్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, మిత్రులు కేక్ కట్ చేసి వెయ్యి మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొండ శ్రీను, వెంకన్న, శాలిగౌరారం పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షుడు పార్థసారథి, పీఆర్టీయూ అధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు నర్సింహులు, ముజాఫర్, ఏసురత్నం, గుండగోని వెంకన్న, యాతాకుల కిరణ్, సోమయ్య, రాజు, మోయిజ్, వెంకన్న పాల్గొన్నారు.
కట్టంగూర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, మండల పరిషత్ గౌరవ సలహాదారుడు శేరి ఛత్రపతి కేక్ కట్ చేసి పంచాయతీ ఇబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చెనగోని సతీశ్, గద్దపాటి దానయ్య, నర్సింగ్ దుర్గయ్య, మేకల రమేశ్, పోగుల నర్సింహ, తిరుమలేశ్, నర్సింగ్ నర్సింహ, యాపాల అనంతరెడ్డి, ఊట్కూరి యాదయ్య, వనం రాంబాబు పాల్గొన్నారు. కేతేపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. వైస్ ఎంపీపీ పీబీ మాధవి, ఎంపీటీసీ ఎ.వెంకన్నయాదవ్, టీఆర్ఎస్ నాయకులు చిముట వెంకన్నయాదవ్, కొప్పుల ప్రదీప్రెడ్డి, బంటు మహేందర్ పాల్గొన్నారు. చిట్యాలలో టీఆర్ఎస్ నాయకుడు శేపూరి మధుసూదన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. బలికె నిరంజన్, పొన్నాల రాంబాబు, వై.కరుణాకర్రెడ్డి, నూనె యాదగిరి, కొసనం యాదగిరి పాల్గొన్నారు.