న్యూఢిల్లీ, మార్చి 11: గత నెల ఫిబ్రవరిలో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లోకి మదుపరులు రూ.491 కోట్ల పెట్టుబడులను తెచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా దిగొస్తున్న ధరలను మదుపరులు అందిపుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెట్టుబడులకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, కస్టమ్స్ సుంకంలో తగ్గింపు కూడా గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులకు కలిసొస్తున్నాయని చెప్తున్నారు. కాగా, జనవరిలోనూ రూ.625 కోట్ల పెట్టుబడులు రాగా.. అంతకుముందు నెల డిసెంబర్లో రూ.431 కోట్ల పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్లు ఆకర్షించాయి. నవంబర్లో రూ.141 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు దేశీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాలు చెప్తున్నాయి.