న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఆక్సిజన్, రెమ్డిసివిర్ కొరత వెంటాడుతుండటంతో ఇదే అదనుగా దేశ రాజధానిలో అక్రమార్కులు చెలరేగుతున్నారు. బ్లాక్ మార్కెట్ లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రూ 1.1 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 115 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, రూ 4.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను అనూజ్, శేఖర్, కేశవ్, అనిల్ జైన్ లుగా పోఈలసులు గుర్తించారు. వీరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రూ 1.4 లక్షలకు విక్రయిస్తూ షహీన్ బాగ్ ప్రాంతంలో సయీద్ ఫయల్ అనే వ్యక్తి ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు.