పుణె: ఇంగ్లాండ్తో జరుగుతోన్న చివరిదైన మూడో వన్డేలో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మెరుపులు మెరిపిస్తున్నాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి బౌలర్లపై విరుచుకుపడుతున్న హార్దిక్ 36 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో 50 మార్క్ చేరుకున్నాడు. వన్డేల్లో అతనికిది ఏడో అర్ధశతకం కావడం విశేషం. శామ్ కరన్ వేసిన 36వ ఓవర్ ఆఖరి బంతికి పంత్(78)..వికెట్ కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సెంచరీ దిశగా సాగుతున్న పంత్ అనూహ్యంగా ఔటయ్యాడు. 38 ఓవర్లకు భారత్ 5 వికెట్లకు 267 పరుగులు చేసింది. ప్రస్తుతం సోదరులు హార్దిక్(58), కృనాల్(2) క్రీజులో ఉన్నారు.