ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటుతో మారుతున్న రూపురేఖలు
స్వయంగా నిధులు ఖర్చుపెట్టుకుంటున్న గిరిపుత్రులు
అచ్చంపేట, ఏప్రిల్ 5 : ఉమ్మడి పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసీ చెంచు పెంటలు ప్ర స్తుతం స్వయం పాలనలో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్ గిరిజన తండాలు, చెంచుగూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పుష్కలంగా వస్తున్న నిధులతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్న ఆదివాసీ చెంచుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో దయనీయంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో వారి జీవన సరళిలో క్రమంగా మార్పులు వ చ్చాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో, లింగాల మం డలం అప్పాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అప్పాపూర్ చెంచుపెంటను 12 చెంచు పెంటలతో కలిపి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి చెంచులు మొదటిసారి సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో అ ప్పాయిపల్లి పరిధిలో ఉండడంతో చెంచులు అనేక ఇ బ్బందులు పడ్డారు. రెవెన్యూ, కులం, ఆదాయం ధ్రువపత్రాలు, ఇతర అవసరాల కోసం చెంచులు అప్పాయిపల్లికి వెళ్లాలంటే ఫరహాబాద్, మన్ననూర్, అచ్చంపేట, లింగాల మీదుగా దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాల్సి వచ్చేది. తీరా అక్కడికి వెళ్లాక అధికారు లు ఉంటారో.. ఉండరో తెలియని పరిస్థితి. దీంతో వా రు పనుల నిమిత్తం వెళ్లడమే మానేశారు. ప్రస్తుతం ప్ర త్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు కావడంతో వారి పరిస్థితుల్లో క్రమంగా మార్పులొచ్చాయి.
స్వయం పాలనలో అభివృద్ధి వైపు..
పుల్లాయపల్లి, రాంపూర్, ఆగర్లపెంట, భౌరాపూర్, వేములపాయవాగు, సంగడిగుండలు, మేడిమొల్కల, లింగబేరి, నీరుగంగా, దోరాలపెంట, ఈర్లపెంటలను క లిపి అప్పాపూర్ చెంచు పెంటను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. అన్ని పెంటల చెంచులు కలిసి డిగ్రీ వరకు చదువుకోవడంతోపాటు సమాజంపై అవగాహన ఉన్న బాలగురువయ్యను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే అన్ని చెంచు పెంటల నుంచి వార్డు సభ్యులను ఎన్నుకున్నారు. స ర్పంచుల పాలన రెండేళ్లు పూర్తయింది. ప్రత్యేక గ్రామ పంచాయతీ కావడంతో ప్రతి నెలా ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. వా టిని చెంచులందరూ కలిసి సమావేశమై ఏం పనులు చే పట్టాలో తీర్మానాలు చేసుకుంటున్నారు. జనన, మరణాలను అక్కడే రికార్డు చేస్తున్నారు. కులం, ఆదాయం, ఇతర ధ్రువీకరణ పత్రాలను సర్పంచ్ ద్వారా నేరుగా లింగాలకు వెళ్లి తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ కి ట్రాక్టర్ కొనుగోలు చేశారు. పల్లె ప్రగతిలో భా గంగా అనేక పనులు చేపట్టారు. అన్ని పెంటలలో గుడిసెల చుట్టూ, ర హదారికి ఇరువైపులా పిచ్చిమొక్కలు తొలగించారు. గుంతలు ఏర్పడిన రోడ్ల ను మట్టితో పూడ్చారు. డంపింగ్యార్డు కొంత వరకు నిర్మించారు. మోటర్లకు, చేతిపంపుల కు మరమ్మతులు చేయిస్తున్నారు. బోర్లు వేయిస్తున్నారు. గ్రామ పంచాయతీ కా ర్మికుడిని నియమించి గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించుకుంటున్నారు. అన్ని పెంటలకు మిషన్ భగీరథ జలాలు అందుతున్నా యి. కొన్ని చెంచు పెంటల్లో పనులు చివరిదశలో ఉన్నా యి. శాశ్వత నిర్మాణ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీశాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయి. టైగర్ రి జర్వ్ అటవీ ప్రాంతం కావడంతో శ్మశానవాటిక, డం పింగ్యార్డు చేపట్టేందుకు ఇబ్బందిగా మారింది.
అభివృద్ధి పనులు చేపడుతున్నాం..
ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో 12 చెంచు పెంటల్లో కావాల్సిన అభివృద్ధి పనులను తీర్మానా ల మేరకు చేపడుతున్నాం. ఈర్లపెంటకు రూ.13 లక్షలతో అటవీశాఖ అధికారులు ఉపాధి హామీ ప థకం ద్వారా రోడ్డు వేస్తున్నారు. వి ప్ గువ్వల సహకారంతో అన్ని పెంటల్లో ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లాలు బిగించి నీళ్లు అందిస్తున్నాం. కృష్ణానది ఒడ్డున ఆంధ్రా జాలర్లు వచ్చి చేపలు పడుతున్నారు. మమ్మల్ని రానివ్వడం లేదు. ఈ విషయాన్ని విప్ గువ్వల దృష్టికి తీసుకెళ్లాను. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అప్పాపూర్లో సబ్సెంటర్ ఏర్పాటు చేయాలి.
మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి..
అప్పాపూర్ పెంటలో ఇంటింటికీ నల్లా బిగించి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నారు. గ్రామ పంచాయతీ అయ్యాక పనులు మంచిగా జరుగుతున్నాయి. సర్పంచ్ అ న్ని పనులు చేస్తున్నాడు. పింఛన్ వ స్తుంది. గుడిసెల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. నిప్పు రాజుకుంటున్నది. గవర్నమెంట్ మాకు ఇండ్లు కట్టించాలి. ట్రైసైకిల్ ఇప్పించాలి. – గురువయ్య, దివ్యాంగుడు, అప్పాపూర్
అందరం కలిసి పనులు చేసుకుంటున్నాం..
గ్రామ పంచాయతీ కావడంతో అందరం చర్చించుకొని పనులు చేసుకుంటున్నాం. అంత మంచిగనే ఉన్నది. సర్కారోళ్లు ఇండ్లు కట్టించి ఇస్తే బాగుంటుంది. ఎడ్ల బండ్లు ఉన్నా.. ఎడ్లు లేక వ్యవసాయం చేయడం ఇబ్బందిగా ఉన్నది. మంచినీళ్లు వస్తున్నాయి. ఒక బోరు చెడిపోయింది. ఇంకో బోరు వేయించాలి.
ఇవి కూడా చదవండి
మావోల చెరలో మిస్సింగ్ జవాను..
హోమ్లోన్పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ