న్యూఢిల్లీ, జూలై 12: లాక్డౌన్లు కొనసాగినా, మే నెలలో పారిశ్రామికోత్పత్తి 29.3 శాతం వృద్ధిచెందింది. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన పారిశ్రామికోత్పత్తి సూచీ డాటా ప్రకారం తయారీ రంగం ఉత్పత్తి 34.5 శాతం పెరగ్గా, మైనింగ్ రంగం 23.3 శాతం వృద్ధిచెందింది. విద్యుదుత్పత్తి 7.5 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి భారీగా 85.3 శాతం వృద్ధిచెందింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 98.2 శాతం అధికమయ్యింది. అయితే దేశ వ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో 2020 మే నెలలో పారిశ్రామికోత్పత్తి 33.4 శాతం క్షీణించింది. ఈ లో బేస్ కారణంగా 2021 మే నెలలో భారీ వృద్ధి కనబడుతున్నది.
స్థిరంగా రిటైల్ ధరలు
మే నెలతో పోల్చితే స్వల్పంగా తగ్గి జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.26 శాతంగా నమోదైంది. అయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం కంటే ఎక్కువగానే ఉన్నది.