కరోనాతో కన్నుమూసిన ప్రమోద్
ముంబై: టీమ్ఇండియా సీనియర్ లెగ్స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ (60) కరోనా వైరస్తో పోరాడుతూ మృతి చెందారు. వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారని పియూష్ సోమవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. ప్రమోద్ మృతి పట్ల ఇర్ఫాన్ పఠాన్తో పాటు మరికొందరు క్రికెటర్లు సంతాపం తెలిపారు.