హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): అధికారులు ప్రజల మధ్యలో ఉన్నప్పుడే వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం సాధ్యమవుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శుక్రవారం తెలంగాణకు కేటాయించిన 2019 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో కొత్తదనం చూపుతూ గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. నూతన తెలంగాణ రాష్ర్టానికి ట్రైనీ ఐఏఎస్ అధికారులుగా రావడం శుభపరిణామన్నారు. రాష్ర్టాభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ఎంతో అవకాశం ఉందన్నారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జనరల్ హర్ప్రీత్ సింగ్తో పాటు, ట్రైనీ ఐఏఎస్ అధికారులు అంకిత్ చిత్ర మిశ్రా, దీపక్ తివారీ, గరిమా అగర్వాల్, హేమంత్ కేశవ్ పాటిల్, కె.వరుణ్ రెడ్డి, ప్రతిమా సింగ్, రిజ్వాన్ భాషా షేక్ ఉన్నారు.
ఐక్యతతో పని చేస్తూ గొప్ప విజయాలు సాధించి రాజ్భవన్ను దేశంలోని ఇతర రాజ్భవన్లకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని గవర్నర్ తమిళిసై అన్నారు. టాప్ 20 గ్లోబల్ విమెన్ ఎక్స్లెన్స్ -2021లో నిలిచినందుకు శుక్రవారం రాజ్భవన్ సిబ్బంది గవర్నర్ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎళ్లప్పుడూ ఏదో ఒక మంచి చేయాలన్నదే తన లక్ష్యమన్నారు.